వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.” YSR Praja News Telugu : తాడేపల్లి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విలువలు ప్రతిబింబించే పండుగే సంక్రాంతి అని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించిన వైఎస్ జగన్… భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాల్లో ఆనందం, ఆశావాదం, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. చెడును దహనం చేస్తూ భోగి, సంపదకు స్వాగతం పలికే సంక్రాంతి, పశుసంపదను గౌరవించే కనుమ – ఈ మూడు పండుగలు మన జీవన విధానానికి ప్రతీకలని చెప్పారు.
గ్రామాల్లో భోగి మంటల వెలుగు, రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటలు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి శోభను మరింత పెంచుతున్నాయని జగన్ వివరించారు. ఈ పండుగలు కుటుంబాల మధ్య అనుబంధాన్ని బలపరుస్తాయని, గ్రామీణ సంస్కృతికి నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఈ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ… ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
👉 “మన సంప్రదాయాలు, ఆచారాల పట్ల గౌరవాన్ని గుర్తుచేసే పండుగ సంక్రాంతి. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి” అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.
YSR Praja News : తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. …
YSR Praja News : గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) మరోసారి పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు.…