YSR Praja News Telugu : మాచాన్పల్లి: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ‘జాతీయ అంబేద్కర్ అవార్డు’ గ్రహీత కొళ్ళ యాదయ్య గారు మరోసారి నిరూపించారు.
మాచాన్పల్లి గ్రామానికి చెందిన మంగలి అంతమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతిచెందారు. అంతమ్మ గారి మరణంతో వారి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోవడమే కాకుండా, అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కొళ్ళ యాదయ్య గారు తక్షణమే స్పందించారు.
బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, వారిని ఓదార్చారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తన వంతు బాధ్యతగా రూ. 5,000/- ల ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పారు. సకాలంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన కొళ్ళ యాదయ్య గారి ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మిర్యాల రమేష్, ప్రవీణ్ గౌడ్, బోడ వెంకటయ్య, హరికృష్ణ, క్రాంతి, కోళ్ళ శ్రీనివాస్ మరియు గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




