రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

YSR Praja News Telugu : రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి

 

జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గే వ్యాధి – వైద్యుల సూచనలు

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. భయపడాల్సిన అవసరం లేకపోయినా, వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను వైద్య పరంగా ‘ఓరియెంటా సుట్‌షుగముషి’ అంటారు. ఇది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించదు. వన ప్రాంతాలు, పల్లెలలో ఎక్కువగా కనిపించే పేలు, చిగ్గర్లు, ఈగలు, నల్లులు కుట్టినప్పుడు బ్యాక్టీరియా రక్తంలోకి చేరుతుంది.

 

 

 

లక్షణాలు ఇలా ఉంటాయి

 

అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం

 

తీవ్రమైన తలనొప్పి

 

చలి, కండరాల నొప్పులు

 

లింఫ్ గ్రంథుల వాపు

 

కొందరిలో కంటి ఎర్రదనం, దగ్గు

 

50% మందిలో శరీరంపై దద్దుర్లు

 

 

కుట్టిన ప్రదేశంలో నల్లని మచ్చ కనిపించడం ప్రత్యేక లక్షణం. దీనినే ‘ఎస్కార్’ అని అంటారు. ఇది నొప్పి లేకుండా కొన్ని రోజుల్లో ఎండిపోతుంది.

 

పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

 

 

 

నిర్ధారణ పద్ధతులు

 

వైద్యులు కింది పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు

 

రక్తపరీక్షలలో ఎలీసా

 

ఇమ్యూనో ఫ్లోరోసెంట్ అస్సే (IFA)

 

PCR వంటి మాలిక్యులర్ పరీక్షలు

 

 

 

 

చికిత్స – పూర్తిగా నయం చేయగల వ్యాధి

 

సమయానికి మందు ప్రారంభిస్తే 24–48 గంటల్లోనే లక్షణాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

 

చికిత్స సమయంలో:

 

ద్రవాలు, నీరు, జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి

 

సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి

 

 

సాధారణంగా ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. కానీ నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని ముఖ్య అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

 

 

 

నిపుణుల హెచ్చరిక

 

వ్యాప్తిని అదుపు చేయడం అత్యంత ముఖ్యం. వాహకాలైన పురుగులను నియంత్రించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అడవి ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *