YSR Praja News : హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, శనివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆమె లేఖ రాశారు.
‘‘సమ్మిట్కు పంపిన ఆహ్వానం పట్ల ధన్యవాదాలు. అయితే, అదే రోజుల్లో ముందుగానే నిర్ణయించిన జిల్లాల పర్యటనల కారణంగా కార్యక్రమానికి హాజరు కావడం సాధ్యంకాలేకపోతుంది’’ అని పేర్కొన్నారు.
సమ్మిట్ సందర్భంగా జరిగే చర్చలు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి దోహదపడాలనే ఆకాంక్షను మమత వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ వేదిక ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పురోగతి రూపంలో మంచి ఫలితాలు రావాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
YSR Praja News Telugu : హైదరాబాద్: వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఏర్పడే విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ…
YSR Praja News Telugu : ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు…