సంగారెడ్డిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు వైయస్సార్సీపి నాయకులు సాయినాథ్ రెడ్డి

YSR Praja News Telugu : వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతిని సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం పరిధిలోని ఆరుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాన్ని లక్ష్మారెడ్డి గారి సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, రంగల్ల రమేష్, దత్త రెడ్డి తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు వైఎస్సార్ గారి సేవలను స్మరించుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మహత్తర మార్పులు తీసుకువచ్చాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, 104 ఆరోగ్య సేవలు వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని కొనియాడారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడిన పడన అధ్యక్షులు సాయినాథ్ రెడ్డి, “పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ పాలన కొనసాగింది. ఆయన చూపిన మార్గం నేటి నాయకులకు ఆదర్శం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు రాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.