YSR Praja News Telugu : జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో మరోసారి మానవత్వం వెల్లివిరిసింది. అనారోగ్యంతో బాధపడుతూ, దిక్కుతోచని స్థితిలో మంచానికే పరిమితమైన ఓ నిరుపేద వృద్ధురాలికి భీమ్ ఆర్మీ చీఫ్ సిద్ధూ రావణ్ అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి “నేనున్నాను” అంటూ ముందుకు వచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.
దీనస్థితిలో వృద్ధురాలు.. పట్టించుకోని ఆప్తులు
జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టింది. బంధువులు, అందరూ ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీసం మందులు (మెడిసిన్) కొనుక్కునేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వ లేక, అనారోగ్య బాధను భరించలేక ఆ వృద్ధ తల్లి పడుతున్న ఆవేదన స్థానికులను కలచివేసింది.
తక్షణమే స్పందించిన సిద్ధూ రావణ్
వృద్ధురాలి దీనస్థితిని గమనించిన ఓ మిత్రుడు, భీమ్ ఆర్మీ చీఫ్ సిద్ధూ రావణ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే చలించిపోయిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బృందంతో కలిసి నేరుగా రాంనగర్లోని ఆ వృద్ధురాలి నివాసానికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని, పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే మందుల కొనుగోలు నిమిత్తం, ఇతర అవసరాల కోసం ఆ వృద్ధురాలికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.
పేదల పాలిట ఆపద్బాంధవుడు..
జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కడైనా, ఎవరైనా కటిక పేదరికంలో ఉండి సాయం కోసం ఎదురుచూస్తుంటే.. కుల మతాలకు అతీతంగా అండగా నిలిచే నాయకుడిగా సిద్ధూ రావణ్కు పేరుంది. ఈ ఘటనతో ఆయన మరోసారి నిరుపేదలకు భరోసా కల్పించారు. కష్టకాలంలో ఆదుకున్న సిద్ధూ రావణ్కు ఆ వృద్ధ తల్లి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.
పాల్గొన్న బృందం సభ్యులు
ఈ సేవా కార్యక్రమంలో సిద్ధూ రావణ్తో పాటు యువకులు, బృందం సభ్యులు నరసింహ, బాల్రాజ్, బలరాం కామ్లే, సందీప్, నాని, నర్సింలు (బాగిరెడ్డిపల్లి), నాగరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




