మన హక్కుల కోసం ఒక్కటవుదాం: పెద్దేముల్ మండల మైనార్టీలకు అఫ్రోజ్ ఖాన్ పిలుపు

YSR Praja News Telugu : పెద్దేముల్ మండల మైనార్టీలకు ఐక్యత పిలుపు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అవగాహన సందేశం

పెద్దేముల్ మండలంలోని మైనారిటీ సోదర సోదరీమణులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. భవిష్యత్ తరాల సంక్షేమం, సమాన అవకాశాల సాధన, రాజ్యాంగ హక్కుల రక్షణ లక్ష్యంగా అందరూ ఒకే తాటిపై నిలవాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పెద్దేముల్ మండల అధ్యక్షులు అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే సంఘటిత శక్తి ఎంతో కీలకమని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి ప్రధాన అంశాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రతి మైనారిటీ కుటుంబం తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితిలో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. ఐక్యత ద్వారా మాత్రమే హక్కులను సాధించగలమని, సమిష్టి పోరాటం ద్వారానే మార్పు సాధ్యమని అన్నారు.

“ఐక్యతే మన బలం – పోరాటమే మన మార్గం” అనే నినాదంతో ముందుకు సాగుతూ, మైనారిటీల గళాన్ని బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చేరవేయడం ప్రధాన లక్ష్యమని నాయకులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *