మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి రెండేళ్లు: మహిళలు చేసిన ప్రయాణాలు, సేవల విలువ ఎంత?

YSR Praja News : ⭐మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తైన్న నేపథ్యం
తెలంగాణలో మహిళల ప్రయాణాలకు గాలివానలో గొడుగు లాగా అందించిన మహాలక్ష్మి పథకం ప్రజల్లో విశేష స్పందనను తెచ్చుకుంది. బస్సు ఛార్జీల భారం లేకుండా మహిళలు ఎంతో స్వేచ్ఛగా ఉద్యోగాలు, విద్య, ఆసుపత్రి, శుభకార్యాలు, భక్తి యాత్రలు తదితర పనుల కోసం ప్రయాణించగలగడం ఈ పథకంతో సాధ్యమైంది.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఆ ప్రారంభం నుంచి ఈరోజు వరకు… కచ్చితంగా రెండు ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ కాలంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో చేసిన ప్రయాణాలు ఎంతంటే…
👉 2.51 వందల కోట్ల ప్రయాణాలు!
👉 మార్కెట్ విలువ ప్రకారం అయితే… ₹8,459 కోట్ల సేవలు ఉచితంగా!
ఇదే అసలు ‘ఆడాళ్లా మజాకా..!’
మహిళల జీవనశైలిలో భారీ మార్పులు
ఈ పథకం వల్ల—
కుటుంబ సభ్యులను సులభంగా కలుసుకునే అవకాశం పెరిగింది
ఖర్చు లేకుండా అవసరమైన చోటుకు వెంటనే చేరే సౌకర్యం
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అనుసంధానం మెరుగైంది
విద్య, ఉపాధి అవకాశాలకు మహిళలు మరింత చేరువయ్యారు
ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా చెప్పింది —
“మహిళలు ప్రయాణికులుగానే కాదు… బస్సుల యజమానులుగా కూడా ఎదగాలి”
అధికారుల శుభాకాంక్షలు
మహాలక్ష్మి పథకం రెండేళ్ల సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ సిబ్బంది సేవలను అభినందిస్తూ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల సంక్షేమానికి అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *