
YSR Praja News : రెండో విడత పంచాయతీ ఎన్నికలు: రాష్ట్రంలో పోటీ వేడి – ఏకగ్రీవాల్లో కామారెడ్డి ముందంజ
హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 4,332 పంచాయతీలకు పోలింగ్ జరగనున్న ఈ దశలో, 415 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఖరారు అయ్యాయి. మరోవైపు 5 పంచాయతీల్లో నామినేషన్లు ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మిగిలిన స్థానాల్లో 3,911 సర్పంచ్ పోస్టులకు 13,128 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అదేవిధంగా 38,322 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేస్తే, అందులో 8,304 వార్డులు పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యాయి. 107 వార్డుల్లో నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా 29,903 వార్డుల్లో 78,158 మంది వార్డ్ ప్రతినిధుల అభ్యర్థులు ప్రజాభిమతం కోసం బరిలో ఉన్నారు.
—
జిల్లాల వారీ ఏకగ్రీవాలు – కామారెడ్డి టాప్లో
ఏకగ్రీవాల పరంగా అత్యధికంగా కామారెడ్డి జిల్లా ముందంజలో ఉంది.
జిల్లా మొత్తం పంచాయతీలు ఏకగ్రీవ సర్పంచ్ వార్డులు ఏకగ్రీవ వార్డులు
కామారెడ్డి 197 44 1,654 776
నిజామాబాద్ 196 38 1,760 674
నల్లగొండ 282 38 2,418 553
ఇక కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం ఒక్క పంచాయతీ మాత్రమే ఏకగ్రీవం కావడం, మంచిర్యాల–వరంగల్ జిల్లాల్లో 2 చొప్పున మాత్రమే ఏకగ్రీవాలు నమోదవడం విశేషం.
మొత్తం మీద, ఈ విడతలో సుమారు 10% పంచాయతీలు పోటీ లేకుండా ముగిసిన సంగతి తెలిసిందే. మిగిలిన చోట్ల సర్పంచ్ పోస్టులకు 3-4 మంది, వార్డులకు 2-3 మంది అభ్యర్థులు సగటున పోటీ పడుతున్నారు. డిసెంబర్ 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
—
అభ్యర్థుల ప్రచారంలో వినూత్న పద్ధతులు
జనగామ జిల్లా – లింగాలఘణపురం ప్రత్యేకం
అభ్యర్థి ఓటర్లకు సండే స్పెషల్గా ‘చికెన్ టోకెన్లు’ పంచాడు. తీసుకున్న టోకెన్ చూపిస్తే చికెన్ తీసుకెళ్లేలా ఇద్దరు షాపుల్లో ఏర్పాటు చేయడం ఓటర్లలో చర్చనీయాంశమైంది.
—
ఓటర్ల సంఖ్య జనాభా కంటే ఎక్కువ?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో విచిత్ర పరిస్థితి. అధికారుల జాబితాలో జనాభా కన్నా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదు అయ్యింది.
సూర్యతండా: జనాభా – 498 | ఓటర్లు – 499
కొనాయమాకుల: జనాభా – 850 | ఓటర్లు – 915
గంగదేవిపల్లి: జనాభా – 1,080 | ఓటర్లు – 1,118
ఈ తేడా ఎ
న్నికల వాతావరణంలో కొత్త చర్చలకు దారితీస్తోంది.




