
YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమ నాయకులు, స్థానిక ప్రజలు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా TUJAC రాష్ట్ర చైర్మన్ భో గే పద్మ మాట్లాడుతూ…
తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన చారి త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆయన ఆశయాలను సాధించే దిశగా అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పలువురు యువజన సంఘాలు, స్థానిక నేతలు పాల్గొన్నా
రు.




