వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మహబూబ్‌నగర్ అంధుల పాఠశాలలో ఫలహారాల పంపిణీ

YSR Praja News : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అంధుల పాఠశాలలో ఫలహారాల పంపిణీ
మహబూబ్‌నగర్: గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ పట్టణంలోని అంధుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు కర్ని గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ప్రత్యేకించి దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేసిందని తెలిపారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గౌని శ్రీకాంత్ రెడ్డి, బీసీ శశిధర్, మైబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *