వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు వేడుకలు: హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ నాయకుల ఘనంగా నిర్వహించారు

YSR Praja News : హైదరాబాద్(రామకృష్ణాపురం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణాపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా స్వగృహం వద్ద ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చరణ్ రెడ్డి హాజరై వేడుకలకు మరింత శోభను చేకూర్చారు. అదేవిధంగా సుంకరి రమేష్, రవి చంద్రారెడ్డి, వెంకట్రావు, షణ్ముఖరావు, అచ్యుతరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తడక జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలు, బలహీన వర్గాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ప్రజారంజక పాలనకు ఆయన పాలన కాలం ఒక నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సాక్షి మీడియాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్ని కేసులను ధైర్యంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులకు మనోధైర్యం ఇవ్వాలని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని, తమ నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *